సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూర్- ఎస్ మండలం కాకితండాకు చెందిన పలువురు మహిళలు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం రూ.6 లక్షల అంచనా వ్యయంతో ఏపపూరులో నిర్మించిన బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. రూ.95 లక్షల అంచనా వ్యయంతో కొత్త తండా నుంచి కాకి తండా వరకు 1.6 కిలో మీటర్ల మేర నూతనంగా నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.