యాదాద్రి, ఆగస్టు 11 : యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి గురువారం సాయంత్రం ఉభయ జోడు సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గరుడ వాహన సేవ, అమ్మవారికి తిరుచ్చి సేవ చేపట్టారు. రాత్రి 7 నుంచి 7:45 గంటల వరకు సాయంకాలపు ఆరాధన జరిగింది.
ఆ తర్వాత స్వామివారికి సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారిని సుమా రు 10 వేల మంది దర్శించుకొన్నారు. శ్రావణమాసం సందర్భంగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఖజానాకు రూ.12,35,905 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.Additional services to