హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు జరుగుతున్నాయి. శనివారం ముగ్గురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్కుమార్ సుల్తానియాకు సెర్ప్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజాకు ఉమెన్, చిల్డ్రన్స్, డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ (డబ్ల్యూసీడీఅండ్ఎస్సీ) కమిషనర్గా, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్కు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.