శంషాబాద్ రూరల్, అక్టోబర్ 29: శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సింగపూర్కు అదనపు విమాన సర్వీసులను ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి 11.20 గంటలకు, సింగపూర్ నుంచి 8 గంటలకు ఫ్లైట్ ఉంటుందని అధికారులు వివరించారు. డిమాండ్ దృష్ట్యా సర్వీసులను పెంచినట్టు తెలిపారు.