హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యార్థులను మన దేశానికి రప్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. సూపర్న్యూమరీ కోటాలో విదేశీ విద్యార్థులకు అదనంగా 25% సీట్లను పెంచుకొనే అవకాశం కల్పించింది. అంతర్జాతీయ విద్యార్థులతో మాత్రమే వీటిని భర్తీచేయాలని ఆదేశించింది.