సీపీఎం నేత విజయరాఘవన్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ అదానీ, అంబానీ కోసమేనని సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ ధ్వజమెత్తారు. సీపీఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వీర తెలంగాణ పోరాట వారోత్సవాల ముగింపు సమావేశంలో విజయరాఘవన్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని, అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్కు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎం శ్రీనివాస్, టీ జ్యోతి, సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, పీఎస్ఎన్ మూర్తి, ఎంవీ రమణ, పీ ప్రభాకర్, జే బాబురావు, ఎం మహేందర్, ఎం దశరథ్, నాగవాణి, ఈశ్వర్రావు, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.