హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థతకు గురయ్యారు. చెన్నై అపోలో హాస్పిటల్లో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్టు ఆమె భర్త సెల్వమణి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఐసీయూ నుంచి వార్డుకు తరలించారని పేర్కొంటూ.. సోమవారం ఆడియో విడుదలచేశారు.