హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూజా హెగ్డే స్వీకరించి, ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పూజా హెగ్డే మొక్కలు నాటిన అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని పూజా హెగ్డే పిలుపునిచ్చారు.