మంత్రి కేటీఆర్కు చెక్కు అందజేత
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): తన జన్మదినం సందర్భంగా వరద సహాయక చర్యల కోసం సినీ నటుడు ఉదయ్ శంకర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. మంగళవారం ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిసి చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఉదయ్ శంకర్కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ స్ఫూర్తితో వరద సహాయక చర్యల కోసం విరాళం ఇచ్చానని ఉదయ్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్ చౌదరి, ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు, తాడికొండ సాయికృష్ణ, శివ వీరపనేని పాల్గొన్నారు.