హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు చిరంజీవి రూ. 50 లక్షల విరాళం అందించారు. ఆయన తనయుడు సినీ హీరో రాంచరణ్ తరుఫున మరో రూ. 50 లక్షలు వితరణ చేశారు.
ఇందుకు సంబంధించిన చెక్కులను సోమవారం సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అందజేశారు. అమర్రాజా గ్రూ ప్ తరుఫున రూ. కోటి చెక్కును మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సీఎం రేవంత్కు అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ రూ. 25లక్షలు, మాజీ ఎం పీ రాజమోహన్రెడ్డి రూ. 25 లక్షలు, సినీ నటులు విశ్వక్సేన్ రూ.10 లక్షలు, సాయిధరమ్తేజ్ రూ. 10లక్షలు, అలీ రూ. 3లక్షలు విరాళంగా ఇచ్చారు.