హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజల మనిషి.. అందరికీ అందుబాటులో ఉండి, ట్రబుల్ షూటర్గా పేరొందారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులో హరీశ్ రావు ఎన్నో శిఖరాలు అధిరోహించారని కొనియాడారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ట్రస్ట్ ఛైర్మన్ బాలకృష్ణ, సభ్యులు నామా నాగేశ్వర్ రావు సహా ఇతర సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారని గుర్తు చేశారు. నాన్న ఆశయాలకు అనుగుణంగా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రభుత్వం తనను గౌరవించడం మరిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. శాతకర్ణి సినిమా విడుదల సమయంలో అడగ్గానే సీఎం కేసీఆర్ పన్ను మినహాయింపు ఇచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు.