హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అడవుల్లో వన్యప్రాణి సంపదను మరింత పెంచే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. జూ పారుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాఖాహార జంతువులను పులుల అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయించింది. ఇటీవల వరంగల్ కాకతీయ జూపార్ నుంచి 20 చుకల దుప్పులు, 13 సాంబార్ జింకలు(ఖనుజు), 6 నెమళ్లను ఏటూరునాగారం అభయారణ్యానికి, నెహ్రూ జూపార్ నుంచి 19 చుకల దుప్పులను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో జూపారులు, షామీర్పేట, కిన్నెరసాని, కరీంనగర్లో జింకల పారులో పెద్ద సంఖ్యలో వివిధ రకాల జింకల సంతతి పెరుగుతున్నది. పెరిగిన జంతువులను అటవీ ప్రాంతాలకు తరలించటం ద్వారా మాంసాహార జంతువులకు అవసరమైన వేట జంతువుల సంఖ్యను పెంచాలని అటవీ శాఖ భావించింది.
వచ్చే మార్చి కల్లా దాదాపు 400 జింకలను(చుకల దుప్పి, ఖనుజు, కృష్ణ జింక, మనుబోతు) నెహ్రూ జూపార్, మహావీర్ హరిణ వనస్థలి నుంచి రాష్ట్రంలో ఉన్న పులుల ఆవాసాలకు తరలిస్తామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్) ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరునాగారం, పాకాల అభయారణ్యాల్లో జంతు సమతుల్యత పెంచేలా ఈ తరలింపు దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటైక్షన్ యాక్ట్-1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తరలింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నిబంధన మేరకు జంతువులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామని, అవసరమైన టీకాలు వేస్తామని అధికారులు తెలిపారు. అడవుల్లో ఈ జంతువులను వదిలే చోట్లను అటవీశాఖ జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది. అవసరమైన గడ్డి మైదానాలు, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.