హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజ కార్యకలాపాల నియంత్రణ (రెగ్యులేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్) చట్టంలో భాగంగానే క్వారీలు, మైనింగ్పై చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ సుశీల్కుమార్ స్పష్టంచేశారు. నిబంధనల ప్రకారమే మైనింగ్, క్వారీ లీ జులపై సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘రాష్ట్రంలో కంకర కష్టాలు’ శీర్షికతో ప్రచురితమైన వార్తపై డైరెక్టర్ స్పందించారు.
మం జూరైన లీజులు, తవ్వకాలకు తేడా ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకా రం మూడేండ్లకోసారి మైనర్ మినరల్స్కు సంబంధించి సీనరేజీ ఫీజు, డీడ్ రెంట్ స వరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉం దని తెలిపారు. ఇందులో భాగంగా 2015 లో సవరించిన ఫీజులను ఏడేండ్ల తర్వాత 2022, ఏప్రిల్లో సవరించామని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లీజుదారులకు పర్మిట్ ఫీజును ప్రవేశపెట్టిందని వెల్లడించారు.