హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు తా గు నీటిని అందించిన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు నివేదించింది. జంట జలాశయాల పరిపరిరక్షణకు సంబంధించిన ఏర్పాటైన ఉన్న త స్థాయి కమిటీ నివేదిక వచ్చే వరకు 1996 లో వెలువడిన జీవో 111లోని నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. జీవో 69ను జారీ చేసినా పూర్వపు జీవో అమల్లోనే ఉన్నదని తెలిపింది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలోని 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో జీవో 111లో పేర్కొన్న ఆంక్షలు, నిషేధాజ్ఞలు కొనసాగుతాయని వివరించింది. జీవో 111 సక్రమంగా అమలు చేయడం లేదని పర్యావరణవేత్త డాక్టర్ జీవానంద్రెడ్డి దాఖలు చేసిన పిల్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ పైవివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున పిల్స్ను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించనున్నది.