హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థినుల సమస్యలపై గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.
ఐటీడీఏ పీవోతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి పై చర్యలకు మంత్రి ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మెనూ ప్రకారం నాణ్యమైన ఫుడ్ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి సూచించారు.