భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్పై, దాని ద్వారా వికృత వ్యాఖ్యలు చేస్తున్న చింతపండు నవీన్పై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ జాగృతి నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కోణంలో కావాలనే నిత్యం ఆరోపణలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నవీన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి నాయకురాలు వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, సుచిత్ర, సరిత, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ క్రైం: ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ప్రచారం చేస్తున్న చింతపండు నవీన్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహిళ అని కూడా చూడకుండా సభ్యసమాజం తలదించుకునేలా నవీన్ తన చాన ల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు నిజామాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.