ఫర్టిలైజర్సిటీ: గోదావరిఖని గాంధీ చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ ఉమేందర్ ఓ గర్భిణి పట్ల మానవత్వం చాటారు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ గర్భిణి ఎండలో నడుచుకుంటూ వెళ్లడం ఆయన చూశారు. వెంటనే వివరాలు సేకరించి ఆమెను ఇంటికి చేర్చే బాధ్యతను సీఐ రమేశ్బాబుకు అప్పగించారు. తన వాహనంలో మహిళా కానిస్టేబుల్ను తోడుగా పంపి యైటింక్లయిన్లోని ఆమె ఇంటికి చేర్చారు.