ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adialabad) జిల్లాలోని ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది. మండలంలోని లక్కారం పరిధిలో ఉన్న కేబీనగర్లో దుండగులు ఓ మహిళపై యాసిడ్తో ((acid attack) దాడిచేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఉట్నూరు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.