మేడ్చల్, నవంబర్ 10: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం సరైన మార్గదర్శనం తో సులభమవుతుందని వై-యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు. ఈ ప్ర క్రియలో కీలక అంశాలను గుర్తిస్తే కోరుకున్న యూనివర్సిటీలో విద్యను అభ్యసించవచ్చన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో గురువారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో వై-యాక్సిస్ ‘ఓవర్సీస్ ఎడ్యుకేషన్’పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఔత్సాహిక విద్యార్థులకు తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న వేలమందికి తమ సంస్థ మార్గదర్శనం చేసిందని చెప్పారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన చాలామంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకుంటారని, సరైన గైడ్లైన్స్ లేక ఆగిపోతున్నారని పేర్కొన్నారు. పరీక్షలు, వీసా, భాష తదితర విషయాల్లో అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
యూఎస్, కెనడా వెళ్లాలంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. యూకే, ఆస్ట్రేలియా, యూరప్ తదితర దేశాలకు వెళ్లాలంటే ఫోర్త్ ఇయర్ చేరిన మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రధానంగా రెజ్యుమె, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్పై దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో తమ సంస్థ లక్షల మందికి సేవలు అందజేస్తున్నదని, ఔత్సాహికులు తమను సంప్రదిస్తే 6 నుంచి 7 నెలల్లోగా సంసిద్ధం చేస్తామని వివరించారు. సదస్సుకు వెయ్యి మంది వరకు హాజరై, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సీఈవో అభినవ్రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, టీపీవో, డీన్ డాక్టర్ సృజన్రెడ్డి, కెరీర్ గైడెన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కే శ్రీనివాస్, డాక్టర్ శంకర్నాయక్, ఈవెంట్ మేనేజర్ గణేశ్ పాల్గొన్నారు.
విదేశాలకు వెళ్లి ఉన్న త విద్యను అభ్యసించాలంటే అవగాహన తప్పనిసరి. ఎప్పుడు ప్రక్రియ ప్రారంభించాలి? డాక్యుమెంటేషన్ ఎలా ఉండా లి? తదితర విషయాలు తెలుసుకోవాలి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో వై-యాక్సిస్ సంస్థ దీనిపై అవగాహన కల్పించడం హర్షణీయం. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వై-యాక్సిస్ లాంటి సంస్థలతో విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవచ్చు.
-రాజిరెడ్డి, డైరెక్టర్, సీఎంఆర్ టీసీ, కండ్లకోయ
అమెరికా, కెన డా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉ న్నత విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరున్న యూనివర్సిటీని ఎన్నుకోవాలి. దానికి ముందస్తు ప్రణాళిక, సంసిద్ధత అవసరం. వై-యాక్సిస్ లాంటి సంస్థ తోడ్పాటు ఉంటే విద్యార్థులు అనుకున్న గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నది.
-అభినవ్ రెడ్డి, సీఈవో, సీఎంఆర్ జీఐ