వికారాబాద్: జిల్లాలోని శంకర్పల్లి పోలీసుల రిమాండ్ ఉన్న ఓ నిందితుడు పరారయ్యాడు. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే రాత్రి ఆలస్యం కావడంతో అధికారులు జైలులోకి అనుమతించలేదు. దీంతో వారిని శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే వారిలో మహమ్మద్ హరిషత్ అనే నిందితుడు కనిపించకుండా పోయాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.