హనుమకొండ: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు న్యాయం కావాలంటూ నిరసనకు దిగారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.