హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
గృహావసరాల కోసం వినియోగించే 14 కేజీల సిలిండర్పై కేంద్రం రూ.50 వడ్డించింది. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1053కు పెరిగింది. దీంతో పాటు ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్పై మరో రూ.18 భారం మోపింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
#AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50
Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022