హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 12 వరకు టీఎస్ ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉన్నదని సెట్ కన్వీనర్ పీ వరలక్ష్మి తెలిపారు. ఆలస్య రుసుముతో 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
ఈ నెల 12 తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చని సూచించారు. ఈ నెల 26, 27వ తేదీల్లో రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.