హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ల బదిలీల దరఖాస్తుల స్వీకరణ ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 1,262 మంది టీచర్లు కొత్తగా బదిలీలు కోరుతూ దరఖాస్తులు సమర్పించారు.
మరో 27,929 మంది టీచర్లు దరఖాస్తులను ఎడిట్ చేసుకొన్నారు. ఈ 27వేల దరఖాస్తులను గతంలోనే సమర్పించినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తుల గడువు మంగళవారం ముగియనున్నది.