ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లాలోని కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై(Commercial tax officials) ఏసీబీ (ACB) అధికారుల దాడులు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏసీటీవో శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నారు.
కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద అదనంగా ఉన్న పదివేల రూపాయల నగదు, పత్రాలను సీజ్ చేశారు. వాహనదారుల నుంచి అనధికారికంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు పై ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.