హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): డిప్యూటేషన్ కోసం డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్)కు లంచం ఇచ్చానంటూ వైరల్ అయిన ఆడియోపై ఏసీబీ దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ జరపాలని వైద్యశాఖ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి అదనంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ ఆడియో వివరాలను సేకరించినట్టు సమాచారం.
ఈ ఆడియోలో డీఎంహెచ్వో, ఆయన కార్యాలయ సిబ్బంది ప్రస్తావన ఉండటంతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఏసీబీ భావిస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో విచారణ ప్రారంభమ య్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నల్లగొండ జిల్లాలో దవాఖాన సూపరింటెండెంట్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ గత నెలలో ఏసీబీకి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వోలు, మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న సూపరింటెండెంట్లపై ఏసీబీ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఉన్నతాధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారనే కారణంతో ఆడియోలో మాట్లాడిన ఉద్యోగినిని డీహెచ్ హుటాహుటిన సస్పెండ్ చేశారు. అయితే ఆఘమేఘాల మీద సస్పెండ్ చేయటం, తదనంతర పరిణామాలను బట్టి.. ఆమె చేసిన ఆరోపణలు వాస్తవం కావొచ్చని వైద్యశాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెండ్కు ఉద్యోగినికి నోటీసులు ఇవ్వడమో, వివరణ తీసుకొని నిజానిజాలు నిర్ధారణ చేయాలి. కానీ అవేవీ జరగలేదని సమాచారం.
మరోవైపు ఇదే ఆడియోలో అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ను తప్పించారు. ఆయన స్థానంలో డాక్టర్ శ్రీరామ్కు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మరో రెండు జిల్లాల డీఎంహెచ్వోలను మార్చారు. జనగామ డీఎంహెచ్వో ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖలో జరుగుతున్న దందాలు నిజమేనన్న భావన కలిగిస్తున్నాయని చర్చించుకుంటున్నారు.