కామారెడ్డి, జనవరి 8: వాహనాల అద్దె బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్కో ఏఈ రాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భైరవస్వామి అనే వ్యక్తి రెండు వాహనాలను ట్రాన్స్కోకు అద్దెకిచ్చారు. నెలకు ఒక్కో వాహనానికి రూ.61 వేల అద్దెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ట్రాన్స్కో ఏఈ రాజు బిల్లు చేయాల్సి ఉంటుంది.
మూడు బిల్లు చెల్లించేందుకు రూ.12,500 డిమాండ్ చేయగా భైరవస్వామి ఏసీబీని ఆశ్రయించారు. అయితే లంచం డబ్బులను తన స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తికి ఓ జిరాక్స్ సెంటర్లో ఇవ్వాలని భైరవస్వామికి ఏఈ రాజు సూచించాడు. ఆ మేరకు సంతోష్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈ రాజు, అతని స్నేహితుడు సంతోష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.