హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ఈడీ, సీబీఐ పేరిట ప్రతిపక్షాలపై వేధింపులకు దిగుతున్నదని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఇరికించేందుకు ఈడీ యత్నిస్తుండడమే అందుకు నిదర్శనమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసులో కేవలం అనుమానితురాలు అంటూనే కనీసం ఒక మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా ఎమ్మెల్సీ కవిత హక్కులకు భంగం కలిగేలా ఈడీ వ్యవహరిస్తుండడం హేయమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమసారథి, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎదుగుదలను ఓర్వలేకే బీజేపీ బెంబేలెత్తుతున్నదని అన్నారు. అందులో భాగంగా తప్పుడు కేసులను బనాయి స్తూ రాజకీయం గా అప్రతిష్టపాలు చేయాలని బీజేపీ కుట్రలను పన్నుతున్నదని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా బీసీ, ఎంబీసీ కు లాలు, ముఖ్యంగా మహిళలు అం డగా ఉండాలని పిలుపునిచ్చారు.