హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): వ్యా పారంలో పెట్టుబడి పెడతానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. తర్వాత ఆ నగదును వాడుకున్నాడు. తీరా డబ్బులు అడిగిసేరికి కనిపించకుండాపోయాడు. మూడేండ్లుగా పరారీలో ఉన్న ఆ నిందితుడిని తెలంగాణ పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్లోని హిమాయత్నగర్కు చెందిన పంకిత్ మెహతా, దిల్సుఖ్నగర్కు చెందిన షెంకీ పాలన్కు ఏబీఎస్ఎస్ పేరిట ఐరన్ ఓర్ మార్కెటింగ్ కంపె నీ ఉన్నది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే 5% చొప్పున.. 11 నెలల్లో పెట్టుబడి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని సికింద్రాబాద్లో స్థిరపడ్డ రాజస్థాన్కు చెందిన అశీష్జైన్ను నమ్మించారు.
అతను తన వద్ద ఉన్న 12.50 లక్షలతో పాటు తన తల్లి వద్ద ఉన్న 12.50 లక్షల నగదును పెట్టుబడికి అందజేశాడు. కానీ పంకి త్, షెంకీ ఆ సొమ్మును వాడుకొన్నారు. దీంతో అశీష్జైన్ 2017లో ఫోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. వీరిపై నాంపల్లి కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2020 నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు పంకిత్ను ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకొన్న పోలీసు సిబ్బందిని సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ అభినందించారు.