నల్లగొండ:ఇప్పటివరకు 72 శాతానికిపైగా ధాన్యం కొనుగులు జరిగిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ప్రభుత్వం ఈసారి గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. నల్లగొండ పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ను గవర్నర్ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసారి వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.
అంతకుముందు పాతబస్తిలోని సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభం, మూల విరాట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు.