యాదాద్రి, ఆగస్టు 4: యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడిని గురువా రం ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. సువర్ణ ప్రతిష్ఠా అలంకార మూర్తులకు అభిషేక పర్వాలు కొనసాగాయి. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు లక్ష్మీనృసింహుడికి గజవాహన సేవ చేపట్టారు.
నిత్య తిరుకల్యాణోత్సం నిర్వహించారు. ఖజానాకు రూ.13,13,286 ఆదాయం సమకూరినట్టు ఈవో గీత తెలిపారు. 7 నుంచి గుట్టలో పవిత్రోత్సవాలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్ర ధానాలయంతోపాటు పాతగుట్టలో ఈ నెల 7 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ప్ర ధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో శ్రావణ శుద్ధ దశమి ఆదివారం పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.