యాదాద్రి, అక్టోబర్ 16: యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడికి నిజాభిషేకం అత్యంత వైభవంగా జరిపారు. ఆదివారం ఉదయం 3.30 నుంచి 4 వరకు అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మేల్కొలిపారు. తీర్థం, పంచామృతాలతో అభిషేకించారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీ ఆంజనేయ స్వామివారి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం తిరువీధి సేవ, దర్బార్ సేవ నిర్వహించారు.