గన్నేరువరం : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం డి 8 కెనాల్ వద్ద కాళేశ్వర ( Kaleshwaram ) జలాలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) చిత్రపటానికి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ అభిషేకం ( Abhishekam ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వల్లే గన్నేరువరం మండలం కాళేశ్వర జలాలతో సస్యశ్యామలమైందన్నారు.
మండలంలో 2వేల ఎకరాల సాగు నుంచి 17వేల ఎకరాల సాగు పెరిగిందని, 15 లక్షలు పలికే భూముల ధరలు రూ. 50 లక్షలు పెరిగిందని తెలిపారు. ఎర్రటి ఎండాకాలంలో కూడా కాలువ ద్వారా నీళ్లు అందడానికి గులాబీ జెండా కారణమన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ధర్మం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతలు తప్ప రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.