యాదాద్రి, ఏప్రిల్ 17: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్టు ఈవో గీత ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిత్య తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. 19న సుదర్శన నారసింహ హోమం ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్జిత పూజల టికెట్లను కొండకింద కల్యాణకట్ట వద్ద గల సీఆర్వో కార్యాలయం, కొండపై క్యూ కాంప్లెక్స్లో టికెట్ కౌంటర్లలో అందిస్తామని తెలిపారు.