హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘ఆధార్ కార్డు వివరాలు వెల్లడించడం పూర్తిగా ఐచ్ఛికం. మీ ఇష్టముంటేనే ఇవ్వండి.. బలవంతం లేదు..’ ఇది సుప్రీంకోర్టు మొదలుకొని ఎన్నికల కమిషన్ వరకు అందరూ చెప్పే ముచ్చట. కానీ, సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చూస్తుంటే.. ‘పేరుకే ఐచ్ఛికం.. ఇవ్వడం అనివార్యం’ అన్న ట్టు సాగుతున్నది. తెలంగాణ బూత్ లెవల్ అధికారులు తీరు చూస్తుంటే, ఆధార్ నంబర్ ఇవ్వకపోతే ఓటు హకు గాల్లో కలిసిపోతుందేమోనన్న భయం సామాన్యుల్లో కనిపిస్తున్నది.
ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్కాలమ్ కచ్చితంగా నింపాలని బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సామాన్య ఓటర్లు తమ వ్యక్తిగత సమాచార భద్రతను పకనబెట్టి మరీ ఆధార్ నంబర్లను వారి చేతిలో పెడుతున్నారు. దాదాపు 99 శాతం మంది ఓటర్లు స్వచ్ఛందంగానే ఆధార్ వివరాలు ఇస్తున్నారని రాజకీయ నేతలు, అధికారులు చెప్తున్నారు. కానీ, అది ‘స్వచ్ఛందం’ కాదు, అధికారుల ‘ఒత్తిడి’ అని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతున్నది.