సూర్యాపేట : జిల్లాలో దారుణంచోటు చేసుకుంది. బీరుసీసాతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తన సోదరిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఓ యువకుడు మరో యువకుడిని బీరు సీసాతో గొంతు కోసిహత్య చేసిన ఘటన.. సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
మృతుడు తాళ్లగడ్డకు చెందిన దిలీప్ (19)గా గుర్తించారు. దిలీప్ అదే కాలనీకి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన అమ్మాయి సోదరుడు మాట్లాడదామని దిలీప్ను ఆదివారం రాత్రి చెరువు వద్దకు పిలిపించి.. బీరు సీసాతో గొంతుకోసి హత్యచేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.