హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది.
అకౌంట్స్ అసిస్టెంట్స్-టాలీప్రైమ్, బేసిక్ కంప్యూటర్, కంప్యూటర్ హార్డ్వేర్, అడ్వాన్స్ వెల్డింగ్, ఆటోమొబైల్ ఈవీ, టూవీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. ఈ నెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో సంస్థకు నేరుగా హాజరుకావాలని సూచించింది. వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లలో సంప్రదించాలని కోరింది.