హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లాలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మేకను(Goat) కాపాడబోయి ఓ యువకుడు మృతి(Young man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఎల్లారెడ్డిపేట (Yellareddipeta) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకప్ చెందిన మిర్యాలకార్ సాయికృష్ణ (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు గిద్ద చెరువులో పడి చనిపోయాడు.
బుధవారం సాయి కృష్ణ ఎప్పటిలాగే ఉదయం మేకలు కాయడానికి వెళ్లగా తన మందలోని ఒక మేక ప్రమాదవశాత్తు గిద్ద చెరువులో పడగా సదరు మేకను కాపాడడానికి సాయి కృష్ణ ప్రయత్నించగా మేక చిక్కుకున్న ఊబిలో సాయి కృష్ణ పడి ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్ఐ తన బృందంతో సాయి కృష్ణ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకి తరలించారు. కుమారుని మరణ వార్త విన్న తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.