రామాయంపేట, డిసెంబర్ 01 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్( Tractor) అదుపు తప్పి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా.. రామాయం పేట మండలం డి.ధర్మారం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది .రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కని నవీన్(27) తన స్వగ్రామంలోని రాత్రి ట్రాక్టర్పై ధాన్యం తెస్తుండగా డ్రైవర్ పక్కనే కూర్చున్న నవీన్ అదుపుతప్పి ట్రాక్టర్పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నవీన్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టు మార్టన్ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు.