హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల ప్రెస్మీట్లో చెప్పిన అంశాలు రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుత పాఠంలా ఉన్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సీఎం అభిప్రాయాలతో మీరు ఏకీభవించవచ్చు… ఏకీభవించకపోవచ్చు. కానీ అవి రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుతమైన పాఠాలు. రెండున్నర గంటల సీఎం ప్రెస్మీట్ లాంటి మారథాన్ను ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎదుర్కొలేని వారున్నారు’ అని పరోక్షంగా ప్రధాని మోదీకి చురకలంటించారు.