జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆడ శిశువులు 1.4 కిలోల బరువు, మగ శిశువు 1.3 కిలోల బరువుతో పుట్టారు, తల్లీ,బిడ్డలు క్షేమంగా ఉన్నారు.
– డాక్టర్ దీప్తిరెడ్డి, కోరుట్ల