ఖైరతాబాద్ : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజనరీ కలిగిన నేత అని జమ్ము కశ్మీర్ నేషనల్ ఫ్యాంథర్స్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సుప్రీం కోర్టు న్యాయవాది కేఎస్ కృష్ణ(Krishna) అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అల్లర్లు, మతకల్లోలాలు, గొడవలు జరుగలేదన్నారు. గుండాయిజం అనేది పూర్తిగా సమసిపోయిందని, ఇదంతా సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు, ఐటీ హబ్స్, ఫ్లై ఓవర్లు, రోడ్లు, అండర్పాస్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు, 24గంటల విద్యుత్, దళిత బంధు(Dalit Bandu), రైతుబంధు, బీమా పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. పదేండ్ల కాలంలో ఇంతటి అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరుగలేదన్నారు.
స్వయంగా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్( Rajinikanth) తాను హైదరాబాద్లో ఉన్నానా, న్యూయార్క్లోనా అని తెలంగాణను ప్రశంసించారని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, నష్టాల కోర్చి తెలంగాణను సాధించుకున్నామని, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే లాఠీ దెబ్బలు ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు కొట్టించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మాత్రమే ప్రజల సంక్షేమం కోరుతుందని గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేయాలని పార్టీ తరపున కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు డాక్టర్ వరదరాజ్, ఎన్సీహెచ్ శ్రీధర్, వినాయక్, ప్రేమ్ యాదవ్, లక్ష్మికాంత్, మహదేవ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.