Road accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలంలో జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై గత అర్ధరాత్రి కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. బాధితులిద్దరూ మెట్పల్లి పట్టణానికి చెందిన తండ్రీ కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో కొడుకు సాయి అక్షయ్ అక్కడికక్కడే మరణించగా, తండ్రి శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రీకొడుకులు కారులో హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.