నాగర్ కర్నూల్ : అదుపుతప్పి తుఫాను వాహనం(Toofan vehicle )ప్రమాదవశాత్తు నాగర్ కర్నూల్(Nagarkurnool) కేసరి సముద్రం చెరువు(Pond)లోకి దూసుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి ఓ ఎన్నికల అధికారికి తుఫాన్ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.
డ్రైవర్ స్వగ్రామం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల కావడంతో, విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున నాగర్ కర్నూల్ వస్తున్న క్రమంలో ఎండబెట్ల సమీపంలోని బ్రిడ్జి వద్ద వాహనం అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చాకచక్యంగా తప్పించుకున్న డ్రైవర్ మధు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.