Kollapur | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అమరగిరి గ్రామం శివారులో కృష్ణా నది ఒడ్డున పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పెద్ద పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండి, తమకు సమాచారం అందించాలని కోరారు.