హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ క్వార్టర్లు, గెస్ట్హౌస్ నిర్మాణం కోసం షేక్పేట గ్రామంలోని 403 సర్వే నంబర్లో చదరపు గజం రూ.1.5 లక్షల ధరతో ప్రభుత్వం 1,000 గజాల భూమిని కేటాయించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన 571 జీవోను రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదించింది.