భీమదేవరపల్లి, జూలై 28: తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, గాయకుడు, సాంస్కృతిక సారథి బృందం కళాకారుడు మాడుగుల భానుప్రసాద్ అలియాస్ పోచ య్య గురువారం మరణించారు. ఈనెల 13న రోడ్డు ప్రమాదానికి గురైన భానుప్రసాద్ చికిత్సపొందుతూ గురువారం మృతి చెందగా, శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో అంత్యక్రియలు నిర్వహించారు.
భానుప్రసాద్ భౌతికకాయానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ పూలమాల వేసి నివాళులర్పించి, పాడె మోశారు. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. భానుప్రసాద్ ఆకస్మిక మరణం తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భానుప్రసాద్ పాత్ర మరువలేనిదని కొనియాడారు.