కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లోని(Babapur) మైనార్టీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న షేక్ అంజూమ్ అనే విద్యార్థి(Student died) అనారోగ్యంతో మృతి చెందింది. అంజూమ్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించారు.
వారు అసిఫాబాద్ దవాఖానలో చూపించారు. తగ్గకపోవడంతో చంద్రపూర్ వెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు విద్యార్థిని తండ్రి షేక్ కరీం తెలిపారు. తమ కూతురు పాఠశాలలో అనారోగ్యానికి గురైనప్పటికీ సమాచారం ఇవ్వలేదని, అనారోగ్యం పూర్తిగా క్షిణించిన తర్వాత తమకు చెప్పారని కరీం ఆరోపించారు. తమ కూతురు మరణానికి పాఠశాల సిబ్బంది కారణమన్నారు.