కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 4: సమాజంలో అన్ని వృత్తుల వారికి లోగోలు ఉన్నప్పుడు.. తమకు ఎందుకు ఉండకూడదని వినూత్న ఆలోచనతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రత్యేక లోగోను తయారు చేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను కలకాలం గుర్తుంచుకునే విధంగా లోగో రూపకల్పన చేశారు. ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుందనడానికి ‘సత్యమేవ జయతే’ను అందులో జోడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా తాను రూపొందించిన లోగోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినట్టు, ఆధికారిక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నట్టు సత్యప్రకాశ్రావు తెలిపారు.
లోగోలో అంశాలివే