హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్(Police Housing) చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక హోమాన్ని(Homam) నిర్వహించారు. రామగుండలం గోదావరిఖనిలోని ఆయన స్వగృహంలో రెండు రోజుల పాటు వేదపండితుల ఆధ్వర్యంలో హోమాన్ని నిర్వహించారు. దేశానికి సేవలందించాలన్న సంకల్పంతో స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party)దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాలని హోమాన్నినిర్వహించినట్లు ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్(CM KCR) ఆయన కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరాలని ప్రార్థించినట్లు కోలేటి దామోదర్ తెలిపారు. రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతి కలగాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.